మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని దుమ్ముగూడెం ,రేగుబల్లి, తూరుబాక,గంగోలు గ్రామాలలో వరద ముంపు వల్ల ప్రమాదం ఉందని గుర్తించి అధికారులు పునరవస కేంద్రాలకు తరలించిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎంపిటిసి సభ్యులు వంశీకృష్ణ ప్రభుత్వ, అధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ముంపు గురైన ఇళ్లతో పాటు అధికారులు గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల బాధిత కుటుంబాలు కూడా నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 10000 రూపాయలు ముంపు భాదితులకు తక్షణం పరిహారం అందించాలని ఇప్పటికే వారు పనులు లేక చాల ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ముంపు భాదితులతోపాటు ముంపు భయంతో అధికారులు తరలించిన కుటంబాల పేర్లను కూడా మానవతాధృక్పధంతో పరిశీలించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ములకపాడు ఉప సర్పంచి ఆదినారాయణ పార్టి మండల కమిటి సభ్యులు కాక కృష్ణ,రేసు లక్ష్మీ ,జానకమ్మ,రామ లక్ష్మీ తదితురలు పాల్గొన్నారు.
Post A Comment: