★ ఖమ్మం,పరిగి, హయత్నగర్,వరంగల్లో జేఈఈ, ఎంసెట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటు
★ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మన్యం టీవీ వెబ్ న్యూస్:
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ గురుకులాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కొత్త స్టడీ సరిళ్లను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ఆమె హైదరాబాద్లోని సంక్షేమభవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మరిన్ని స్టడీ సరిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రతి స్టడీ సరిల్లో ఫ్యాకల్టీ, కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను సమకూర్చాలని సూచించారు.
గురుకుల విద్యార్థులకు సౌకర్యాలు, భోజనం మరింత మెరుగుపరచాలని, విజిలెన్స్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజేంద్రనగర్లో ఉన్న జేఈఈ, ఎంసెట్ కోచింగ్ సెంటర్ తరహాలో ఖమ్మం, పరిగి, హయత్నగర్, వరంగల్లో కోచింగ్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Post A Comment: