మన్యం మనుగడ వాజేడు జూలై 21:
కేంద్ర ప్రభుత్వం పాలు మరియు పాల ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తాసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు. సామాన్యుడు నడ్డి విరిచే ఈ జీఎస్టీ విధానాన్ని తక్షణమే రద్దు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, స్థానిక జడ్పిటిసి తల్లాడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, ఎంపిటిసి గొంది రమణారావు, టిఆర్ఎస్ అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ముడిగా తిరుపతి యాదవ్, మండల జాయింట్ సెక్రెటరీ చెన్నం సాంబశివరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాపాకుల తాతారావు రైతుబంధు సమన్వయ సమితి జిల్లా మెంబర్ తల్లడి నాన బాబు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పెనుమల్ల వెంకటరెడ్డి ఉపసర్పంచ్ కల్లూరు సతీష్ శ్యామల నాగేష్ చెన్నం శ్రీను తల్లడి వెంకటేశ్వర్లు పూణెం రాంబాబు మద్దె బోయిన శ్రీనివాస్ బోధ బోయిన సత్యం మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: