మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరగనుండగా దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు ఎస్సై రవికుమార్, సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి పెదనలబెల్లి, సీతానగరం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు అనుమనిత వ్యక్తుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దుమ్ముగూడెం మండలం నుంచి కార్యకలాపాలు సాగిస్తారు అనే అనుమానంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రధాన రహదారి, వంతెనలు, కల్వర్టుల వద్ద తనిఖీలు చేశారు. వారపు సంత సందర్భంగా ప్రజలతో ఎస్సై మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తమకు అందించాలని ఎస్సై సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ సురేష్, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: