CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెరుగుతున్న వరదల ఉదృతిని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:


  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • తక్షణ సహాయ చర్యల నిమిత్తం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • పోలీస్ యంత్రాంగంతో పాటు సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్,సిబ్బంది అదనపు బలగాలతో సిద్దం


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం లో పెరుగుతున్న వరదల ఉదృతిని బుధవారం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు.ఈ సందర్భంగా

పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి బాధితులకు ధైర్యం కల్పించారు.తక్షణ సహాయక చర్యల నిమిత్తం హెలికాప్టర్ నుసిద్దంగా ఉంచామని తెలిపారు.భద్రాచలం లోని ఉంటానని విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వివరించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గొదావరి ఉదృతి పెరుగుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు. భద్రాచలంలో గొదావరి బ్రిడ్జి పై నుండి వరద ఉద్రుతినీ పరిశీలించారు.అనంతరం భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ లో గల వరద ముంపు బాధితుల పునరావాస 

కేంద్రాలను పరిశీలించి,వారికి ధైర్యం కల్పించారు.అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ఉదృతి తీవ్రస్థాయిలో ఉంటే తక్షణ సహాయ చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను ఏర్పాటు చేసిందని,ఐటీడీఏ,ఐటీసీ లో హెలిప్యాడ్ సిద్దం చేశామన్నారు.ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు సహాయక చర్యల కోసం పోలీస్ యంత్రాంగంతో పాటు సీఆర్పీఎఫ్,ఎన్డీఆర్ఎఫ్,సిబ్బంది అదనపు బలగాలతో సిద్దంగా చేశామన్నారు.ఇతర ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలని,అనవసరంగా బయటకు రాకుండా ఉండాలని సూచించారు.సాహసకృత్యాలు చేయడం,చేపల వేటకు వెళ్ళడం,అకారణంగా రోడ్లపైకి ఎవరు రావొద్దు అని సూచించారు.ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. గోదావరికి ఎగువ నుండి వస్తున్న భారీ వరదలు, వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలతో ప్రాజెక్టులన్ని,జలమయమైనాయని,దీనితో దిగువ ప్రాంతానికి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నదని అన్నారు.  


భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులకు వచ్చే అవకాశం ఉందని,జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను మంత్రి అదేశించారు.లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని అన్నారు.వరదలు పూర్తి స్ధాయిలో అదుపులోకి వచ్చే వరకు,భద్రాచలంలో మకాం వేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. ముంపు మండలాల్లో,ఆయా ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికారులు,సిబ్బంది,పోలీస్ ఇతర ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.గత అనుభవాల దృశ్య వరదలపై మాకు అంచనా ఉందని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే వ్యూహంతో ఉన్నామని,అధికారులు అన్ని గ్రామాల్లో సిద్దంగా ఉన్నప్పటికీ ప్రజలు సంయమనం పాటించి ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలిపారు.ప్రజల అవసరాల కోసం 24 గంటలు పని చేయువిదంగా కలెక్టరేట్, ఐటిడిఎ,సబ్ కలెక్టర్,ఆర్డిఓ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు అధికారులకు సహకరిస్తూ,పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.జిల్లా యంత్రాంగం,ప్రజలు,వరదలు వర్షాల వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రసవ రోజులు దగ్గరగా ఉన్న గర్భిణి మహిళలను ఆసుపత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి. అనుదీప్,ఎస్పీ వినీత్,ఐటీడీఏ పిఓ గౌతమ్,సిఈ ఇరిగేషన్ శ్రీనివాస్ రెడ్డి,ఎస్ ఈ వెంకటేశ్వర రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ తెల్లం వెంకటరావు,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, పలు శాఖల ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: