మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక పట్టణంలోని బిపిఎల్ స్కూల్ నందు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు, ముంపునకు గురైన గ్రామాలకు చెందిన బాధితులను సోమవారం నాడు వారి దగ్గరికి వెళ్లి,వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వారికి భోజనం,ఇతర వసతులను,కల్పించామన్నారు,అధికారులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత,తహసీల్దార్ భగవాన్ రెడ్డి,ఇతర శాఖల అధికారులు, పిఏసీఎస్ శ్రీనివాస్,పార్టీ మండల అధ్యక్షులు రమణా రెడ్డి,పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: