మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గోదావరి వరదల ముంపుకు గురి అయిన దుమ్ముగూడెం మండలం బండారిగూడెం బాధితులకు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ శుక్రవారం నిత్యవసరాలను దోసపాటి వెంకటేశ్వర్రావు అండ్ బ్రదర్స్ ,సోనీ కన్స్ట్రక్షన్స్ అధినేత హలీమ్ ఖాన్, సాయి అంజనా బజాజ్ షోరూమ్ భద్రాచలం అధినేత ఆకుల శ్రీనివాస్ సౌజన్యంతో పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటిబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు మరిన్ని మా గ్రామానికి వచ్చి వరద బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అదేవిధంగా చాంబర్ ఆఫ్ కామర్స్ భద్రాచల సెక్రటరీ కంభంపాటి సురేష్ మాట్లాడుతూ సేవ్ భద్రాద్రి నుండి ఈ గ్రామానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఏజెన్సీలొ పూర్తి గిరిజనులకే నిలయమైన ఈ గ్రామానికి వచ్చి సహాయం చేయడం తనకెంతో ఆనందం కలిగించిందని రోటరీ క్లబ్ ప్రతినిధి వెంకట్ అన్నారు. బండారి గూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు ఒక మంచి గ్రామాన్ని పరిచయం చేసినందుకు వారికి బజాజ్ షోరూమ్ భద్రాచలం అధినేత శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటిబోయిన వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ పూనెం లక్ష్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మెన్ కుంజా నాగేశ్వరావు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: