CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సహాయ నిధిని సద్వినియోగం చేసుకోండి.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం


సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నుండి విపత్కర పరిస్థితుల్లో మంజూరయ్యే గిరిజన సహాయ నిధిని గిరిజనులు సద్వినియోగం చేసుకునేలా గ్రామ సర్పంచ్ లు, పైసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు,మొబిలైజర్లు సహకరించాలని ఐటీడీఏ పైసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ ఒక ప్రకటనలో కోరారు. గత ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆదివాసి గిరిజన గుడాలలో తండాలలో ఇల్లు కూలిపోవడం,పంటలు దెబ్బతినడం,పొంగి పొర్లుతున్న వాగులు వంకలలో చిక్కుకొని పశుసంపద మరణించడం లాంటి సంఘటన జరిగితే ఐటీడీఏ ఏటూరు నాగారం ద్వారా గిరిజన సహాయ నిధి నుండి రూ.25,000లు పొందవచ్చునని ఐటిడిఏ పిఓ తెలిపారన్నారు. గ్రామాలలో ఎక్కడైనా ఇటువంటి సంఘటన జరిగితే ఆయా మండలాల తాసిల్దారుల నుండి తగిన సమాచారం తీసుకువచ్చే విధంగా గిరిజన ప్రజలకు సహకరించాలని సర్పంచ్ లు, పైసా ఉపాధ్యక్షు లు, మొబిలైజర్లను ప్రభాకర్ కోరారు.

Share it:

TS

Post A Comment: