CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముంపు ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలి..సీపీఎం డిమాండ్..

Share it:

 


మన్యం మనుగడ వాజేడు జూలై 10:.   

                                              ప్రకృతి విపత్తుతో భారీ వర్షాలు సంభవించడంతో గోదావరి పరివాహక ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. వ్యవసాయ రంగంలో అధిక సంఖ్యలో రైతులు వరి విత్తనలు పంట పొలాలలో పిసికారి చేశారు.గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పంట నష్టపోయిన రైతులకు వరి విత్తనాలు నష్టపరిహారంగా వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని వాజేడు మండల సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది, మండలంలో సిపిఎం పార్టీ మండల కమిటీ టేకులగూడెం కృష్ణాపురం చండ్రుపట్ల గంగారం కడేకల్ గ్రామాల్లో పర్యటించారు, పర్యటనలో భాగంగా వరద ముంపులకు ఇల్లు కోల్పోయిన బాదిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని,అలాగే ఆయా గ్రామాల వరద ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారంగా రక్షిత ప్రాంతాలలో ఇంటి స్థలాలు కేటాయించాలని, వరద ముంపులో వరి విత్తన పంట కోల్పోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు, కృష్ణాపురం చండ్రుపట్ల గంగారం మధ్యలో వరద ముంపులో కరెంటు స్తంభాలు పూర్తిగా మునిగిపోయి ఆయా గ్రామాలకు వర్షాకాలంలో కరెంటు సరఫరా ఇబ్బందిగా మారడం వలన ఎత్తయిన ఇనుముతో కూడిన స్తంభాలను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు దెబ్బ కట్ల లక్ష్మయ్య ,జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రఘుపతి ,దామోదర్ ,కృష్ణబాబు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: