మన్యం మనుగడ, మంగపేట.
విపరీతంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాలనుండి వస్తున్న వరదలు పెరుగుతున్న గోదావరి నీటమట్టం, వరద ఉదృతి గోదావరి నది తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఎగువ నుండి వస్తున్న వరదల వల్ల బుధవారం సాయంత్రం వరకు
భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులు వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద
శరవేగంగా గోదావరి పెరుగుతున్నదని ప్రజలు జిల్లా యంత్రాంగంనకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు
సూచించారు. గోదావరి 66 అడుగులకు చేరితే కరకట్టల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చెబుతున్న ప్రకారం 66 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరితే ఏటూరునాగారం నుండి వాజేడు వెంకటాపురం వైపు వెళ్లే రహదారి,మరొక వైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పాత వంతెన పై రాకపోకలు పూర్తిగా స్థంభించి పోయే అవకాశం ఉంది.గోదావరి పెరిగితే నది తీర ప్రాంతాలు పూర్తిగా మునిగే పోయే అవకాశం ఉంది, ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగి పోయి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి, వర్షాలు ఇప్పటికి శాంతించక పోవడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక నైనా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని భవిష్యత్ లో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ద్యేయంగా నది తీర ప్రాంతాలకు వెంటనే కరకట్టల నిర్మాణం చేపట్టాలి.పెరుగుతున్న గోదావరి నది వరదలు వలన ములుగు జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలైన ఏటూరునాగారం నుండి మంగపేట మండలం లోని నది తీర ప్రాంతాలు కొన్ని పూర్తిగా జలమయం అయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి, అంతే కాకుండా వారి పొలాలకు, ఇంటి పునర్నిర్మాణాలకు కావాల్సిన ఆర్ధిక సహాయం అందించాలని ప్రజలు కోరుకుంటన్నారు.
Post A Comment: