మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీసులు గంజాయితో ఉన్న వ్యక్తులను పట్టుకున్నారు. ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ పాత్రికేయుల సమావేశంలో తెలిపిన కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై గంజాయిని తీసుకెళ్తూ, పోలీసు వారిని చూసి పారిపోతున్న సమయంలో అనుమానించిన ఎస్ ఐ టి వి ఆర్ సూరి వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 3.190 గ్రాముల గంజాయి లభించిందని, దీని విలువ 63 వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. ఎంతో చాకచక్యంగా గంజాయిని తరలిస్తున్న వారిని పట్టుకున్న ఎస్ఐ టీవీఆర్ సూరి, ఆయన బృందాన్ని సిఐ రాజగోపాల్ అభినందించారు. సిఐ రాజగోపాల్ తెలిపిన ప్రకారం నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి.
1) జర్పుల హర్షవర్ధన్ 2) కంగాల నవీన్ 3)రాచపల్లి సుమంత్ 4)మేడి వికాస్ 5)పోశెట్టి నాగరాజు.
ఈ ఐదుగురిలో జర్పుల హర్షవర్ధన్ ఓ ప్రైవేట్ సంస్థ బస్సు క్లీనర్ గా పనిచేస్తూ, విశాఖపట్నం నుండి గంజాయిని తీసుకొస్తున్నట్లుగా తెలిపాడని సిఐ రాజగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజగోపాల్ మాట్లాడుతూ,యువత జల్సా జీవితానికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, ఇలాంటి సంఘటనలు మరి ఎక్కడ జరగకుండా ఉండాలంటే, సమాచారం తెలిసినవారు పోలీసు వారికి వెంటనే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: