CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరదల వల్ల ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలి.--:పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి డిమాండ్.. .

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండల పరిధిలోని అకాల వర్షాలు వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదల కారణంగా ఉండడానికి ఇల్లు లేక టర్బన్ బరకాలు అడ్డుపెట్టుకుని నడిరోడ్డు మీద జీవనాన్ని సాగిస్తున్నారని ప్రభుత్వం ఇచ్చే పదివేల సాయం ఎటు సరిపోదని భద్రాచలం నియోజవర్గంలో అధిక శాతం పేద ప్రజలే గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తూ వారిల్లు వరదల్లో కొట్టుకుపోయాయని అటువంటి వారిని కచ్చితంగా ప్రభుత్వం సర్వ తీసుకుని వీరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని వేడుకున్నారు అలానే వర్షాకాలం సీజన్ కావడంతో వ్యాధులు ప్రబలకుండా దోమల నుండి కాపాడుకోవడానికి దుప్పట్లు దోమతెరలు బాధితులకు అందజేయాలని స్వచ్ఛంద సంస్థలు వివిధ పార్టీ నాయకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.


Share it:

TS

Post A Comment: