CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల కేంద్రం లో నిర్వహించే రిలే నిరాహారదీక్షను జయప్రదం చేయండి.బహుజన్ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ సరియం భీమ్ విజ్ఞప్తి... ..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ ల పై చేసే దాడులను నిరశిస్తూ నిర్వహించే బహుజన్ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షను జయప్రదం చెయండి అని మండల కన్వీనర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలపై జరుగుతున్న అనేకమైన దాడులు వాటిలో మరి ముఖ్యంగా తొలకరి వానపడటం తోనే మొదలయ్యే సమస్య పొడుభూమి. రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివాసీ గిరిజన రైతుల పై మహిళలపై ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులను ఖండిస్తూ, గత 25 సంవత్సరాలుగా సాగుచేస్తున్న పొడుభూములకు హక్కు పత్రాలను మంజూరు చేయాలని, అలాగే రైతులకు చేస్తామన్న 1లక్ష రూపాయల రుణ మాఫీ తక్షణమే అమలు పరచాలని, అవకతవకలకు నిలయమైన ధరణి పోర్టల్ ని రద్దు చేసి పాత ఆన్లైన్ పద్దతిలో పట్టాదార్ పాస్ పుస్తకాల్లో జరిగిన అనేక పొరపాట్లను సరిచెయ్యాలని, కోరుతూ తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ములకపాడు సెంటర్ అంబేడ్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి తాశిల్దార్ కార్యాలయం ఎదుట 10 గంటల నుండి 4:30 గం. వరకు శాంతియుతంగా జరిపే రిలే నిరాహారదీక్షను ఆదివాసీ సంఘాలు, నాయకులు, గిరిజన రైతులు అనేక మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు..

Share it:

TS

Post A Comment: