CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ.మృతుని కుటుంబానికి ప్రమాద బీమా 2 లక్షల చెక్కు అందజేసిన:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామానికి చెందిన బాదావత్ శ్రీను(32) సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి ఆయన కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో,టిఆర్ఎస్ పార్టీ తరపున మంజూరైన రూ.2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని,ప్రతి ఒక్క కార్యకర్త కు టిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం,ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో,గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు.ప్రజల ఆకాంక్ష మేరకు తాము పాలన సాగిస్తున్నామని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించి,అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం.విజయకుమారి,జడ్పిటిసి పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు, రామిరెడ్డి,నవీన్,స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు, మహిళలు,టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: