మన్యం టీవీ దుమ్ముగూడెం :
దుమ్ముగూడెం మండలంలో గురువారం భద్రాది కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు,ఎంపీ మాలోతు కవిత పలు అభివృద్ధి కార్యక్రమంలో మండలంలోని విస్తృతంగా పర్యటించనున్నారు.మండలంలోని మహాదేవపురం గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు, దబ్బనూతుల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తదనంతరం ప్రగళ్లపల్లి పంచాయతీలో పోడు భూముల రైతులతో వారి సమస్యలపై పాల్గొంటారు అనంతరం తిరుగు ప్రయాణంలో ఎస్సీ కాలనీ కె దుమ్ముగూడెం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు,కార్యదర్శి కణితి రాముడు తెలియజేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
Post A Comment: