మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపహాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని ఇరవెండి, కోయగూడెం గ్రామాలలో ఐటీసీ వారి సహకారంతో నూతనంగా సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 2 బస్ షెల్టర్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , మహబూబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఐటీసీ అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటిసి జనరల్ మేనేజర్ శ్యామ్ కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ చెంగల్ రావు, జడ్పిటిసి కామరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, సర్పంచులు కొరస లక్ష్మి, తుపాకుల రామలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు దివ్య, షర్మిల,మండల తెరాస సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: