మన్యం మనుగడ వాజేడు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు 60 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ఉద్యమ రూపంలో పోరాటాలు చేశారు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు,తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు ,నియామకాలు,కొరకు శతాబ్దాల పాటు ఉద్యమాలు చేశారు. ఈ పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రజా ప్రతినిధి ఎంపీపీ శ్యామల శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీపీ శ్యామల శారద మాట్లాడారు. ‘ప్రజావైద్యం, ఆరోగ్య రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోంది. తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముందుగా ప్రభుత్వ హాస్పటిళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది. అధునాతన వైద్యపరికరాలు సమకూర్చింది. అన్నారు. తహాసిల్దార్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నూతనంగా విధుల్లోకి చేరిన తహాసిల్దార్ లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.గ్రామ గ్రామాన జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Post A Comment: