మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం, రాజుపేట గ్రామానికి చెందిన మహమ్మద్ పఠాన్ వలిహైదర్ తండ్రి జమాల్ఖాన్ ఇటీవల పెన్షన్ రావడం లేదని నడి రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన విషయం విదితమే. మహమ్మద్ పఠాన్ వలి హైదర్ ను మన్యం మనుగడ ఈ సందర్బంగా కలిసి మీరు నడిరోడ్డుకు అడ్డంగా పడుకొని పెన్షన్ కోసం నిరసన తెలిపారు కదా ఎవరైనా అధికారులు మిమ్మల్ని కలిసి పెన్షన్ గురించి విచారణ చేసారా అని అడగ్గా ఏ ఒక్క అధికారి వచ్చింది లేదు, కలిసింది లేదు, ఎన్ని సార్లు అధికారులను కలిసి విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడు లేడు అధికారుల కళ్ళకు నాలాంటి ముసలి వాళ్ళు పెన్షన్ కు అర్హులు కారు అనుకుంటున్నారు కాబోలు,పొలాలు ఉండి, మంచి వసతులు ఉన్నోళ్లకు పెన్షన్ వస్తుంది నాకు మాత్రం రావడం లేదు,ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమో కానీ 100 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు అర్హుడినే,200 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు తీసుకున్నాను ఇప్పుడు మాత్రం నాకు పెన్షన్ రావడం లేదు,ఇది ఏమి విచిత్రం అర్ధం కావడం లేదని ఈ వయసు లో ఇంకా అధికారుల చుట్టూ తిరిగే ఓపిక లేదని, నాలాంటి వారికి పెన్షన్ ఇస్తే ప్రభుత్వం ఖజానా ఖాళీ కాదని, ఇకనైనా ప్రభుత్వం, అధికారులు నన్ను పెన్షన్ కు అర్హుడిగా గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలని పత్రికా ముఖంగా కోరారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఆరోగ్యం సహకరించుటలేదు ఇకనైనా కరుణించి పెన్షన్ ఇవ్వండి అని అభ్యర్థించాడు లేదంటే, ఈ సారి ములుగు కలెక్టరేట్ కు వెళ్లి నా గోడు చెప్పుకుంటాను అని వాపోయాడు.
Post A Comment: