గుండాల జూన్16(మన్యం మనుగడ) న్యూ డెమోక్రసీ నాయకులు ఆదివాసి యోధుడు బటన్న ఆశయ సాధన కోసం పని చేస్తామని న్యూ డెమోక్రసీ నాయకులు వై వెంకన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాటన్న స్తూపం వద్ద ఆయన కుమారుడు ఈ సం కృష్ణ జండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాటన్న పీడిత ప్రజల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. 30 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి అనేక పోరాటాలు చేశారని వారు అన్నారు. గుండాల, ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గా ఉపేందర్, గ్రామ కమిటీ నాయకులు అశోక్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: