మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం ఏజెన్సీ గ్రామాల్లో ఎటపాక నుంచి మారాయిగూడెం మీదుగా పెద్ద ఆర్లగూడెం నుండి మూలకాపాడు వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి వినతిపత్రాన్ని ఆర్టీసీ డిఎం కి అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకులు సాయన్న మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పినట్టు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం నిరసిస్తూ నారాయణరావుపెట, తునికి చెరువు, మారాయిగూడెం మూడు దారుల కూడలి లో రాస్తారోకో చేయడం జరిగిందని బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకి వెంటనే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరి మల్లేష్, వెంకటేశ్వర్లు, ధర్మయ్య, వెంకటేశ్వర్లు, దీప్తికా, రాజు, కళ్యాణి, బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: