మన్యం టీవీ దుమ్ముగూడెం ::
పర్ణశాల గ్రామపంచాయతీ పరిధిలో ముసలమడుగు గ్రామం ఉప సర్పంచ్ గుంపు పంచాయతీ నిధులతో సిసి రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సర్పంచ్ వరలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజులుగా పర్ణశాల గ్రామ పంచాయతీలో ఉన్న వివిధ గ్రామాల్లో రహదారి సౌకర్యం మెరుగుపరిచేందుకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టామని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తామని తెలిపారు. అలానే మన పంచాయతీ అభివృద్ధిలో ముందు ఉండాలని దీని ఆదర్శంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దామని, పర్ణశాల పర్యాటక ప్రాంతం కాబట్టి అభివృద్ధి పరంగా ఆదర్శంగా ఉండాలంటే ప్రభుత్వం మరింత నిధులు మంజూరు చేయాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తెల్లం భీమరాజు, ఉపసర్పంచ్ ఖాదర్ బాబు, వార్డు మెంబరు సతీష్, పిసా కార్యదర్శి రాజేశ్వరి,గ్రామస్థులు వాగే వెంకట్రాజు, నాగయ్య, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: