CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలు అడ్డంకులు పెడుతున్నారు.

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం:


దుమ్ముగూడెం మండలం లోని లక్ష్మీ నగరం గ్రామంలో మంగళవారం భారతీయ జనతాపార్టీ ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి జెట్టి వెంకట్ రాజు మాట్లాడుతూ భారత దేశ అధ్యక్షురాలుగా గిరిజన మహిళను బిజెపి ప్రభుత్వం నియమించినందుకు పలు రాజకీయ పార్టీలు ఎన్నో అడ్డంకులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బిజెపి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయని, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించినందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత తక్కువ చూపు ఉందో ప్రజలు ఆలోచించాలని తెలిపారు.ఈ విధంగా అనుచిత ధోరణితో ప్రవర్తించడం సరికాదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో దళిత హిందూ మాలమహానాడు వెల్ఫేర్ సొసైటీ నాయకులు బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: