CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్ రేగా

Share it:


 మన్యం మనుగడ, మణుగూరు :

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం నాడు జాతీయ జెండాను తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన టిఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధ్యమైందని, భవిష్యత్తులో పురోభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది అని  అన్నారు. వేల కోట్ల రూపాయల నిధులను వివిధ ప్రాంతాలకు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను నిర్మించి ప్రజలకు సాగు , తాగునీటిని అందిస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని , అమరుల త్యాగాలు మరువలేనివని,వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.రాష్ట్ర  సాధనలో ప్రజలను ఏకతాటి పైకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్  ఎంతో కృషి చేశారని తెలిపారు.తెలంగాణలోని ప్రజలందరి సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్న దని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: