మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో లో 11 కె.వి విద్యుత్ లైన్ మరమ్మతు లో భాగంగా రోడ్డు కి దూరంగా ఉన్నటువంటి విద్యుత్తు లైను ఈరోజు రోడ్డుకి దగ్గర్లో ఏర్పాటుకు సంబంధిత అధికారులు చేస్తున్నారు ఇట్టి విషయమై గ్రామస్తులు అందరూ వెళ్లి రోడ్డుకి దగ్గర ఎందుకు లైను ఏర్పాటు చేస్తున్నారు అని, పాత లైన్లోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విద్యుత్ సిబ్బంది పెదనల్లబల్లి రైస్ మిల్లు వారి సూచన మేరకు విద్యుత్ లైన్లు మార్పుకు సహకరిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. రోడ్డు పక్కన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెంచుకున్న మొక్కలు సైతం తొలగించి లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్టి విషయం పై అధికారులు స్పందించి 11 కేవీ విద్యుత్ లైన్ పాత లైన్ లోనే కొనసాగలని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దాసు, గ్రామస్తులు సునీత, రాజు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: