CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిల్డ్రన్స్ హోమ్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ పరిధిలోని శివ లింగ పురం నందు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్ సి వారి సహకారంతో ఏర్పాటు చేసిన బాలల సదనం *చిల్డ్రన్స్ హోమ్* ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మంగళవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా విపి రేగా కాంతారావు మాట్లాడుతూ అనాధ పిల్లలకు బాల సదన్ ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.వారికి సకల సౌకర్యాలు కల్పించాలని,ప్రతి ఒక్కరూ వారి కుటుంబ శుభకార్యాలను ఆశ్రమాల్లో జరుపుకోవాలని అన్నారు.


జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,బాలల సదన్, దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించుటకు సహకారం అందించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సురేష్ నాయుడు కృషితో జిల్లాలో పి ఎఫ్ సి నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.బాలల సదన్ నందు అనాధ పిల్లలకు మంచి వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు,వారికి షటిల్ కోర్టు,వాలీబాల్ కోర్టు, పుస్తకాలు ఏర్పాటు చేయాలన్నారు.అదే విధంగా సీసీటీవీ ఏర్పాటు చేయాలని తెలిపారు.అనంతరం 40 మంది వికలాంగులకు బ్యాటరీ తో నడిచే మూడు చక్రాల వాహనాలు,బెడ్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం కు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆర్ వరలక్ష్మి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు కారం.విజయకుమారి,గుమ్మడి. గాంధీ,మున్సిపల్ కమిషనర్ మాధవి,ఎంపీడీవో వీరబాబు, ఎంపీటీసీల సంఘం జిల్లా, కార్యదర్శి కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఎంపిఓ వెంకటేశ్వర్లు,సి డి పి ఓ,ఏ ఎల్ ఈ ఎం సి ఓ సిబ్బంది,ఇతర ఉన్నతాధికారులు,దివ్య ప్రకాష్,మధర్ తెరిస్సా దివ్యంగుల అధ్యక్షులు కృష్ణ,వరప్రసాద్, పీఎఫ్ సి ప్రతినిధి అశోక్,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: