CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అతిపెద్ద వేల్పుల కాటూరం జాతరను విజయవంతం చేయండి.. పాల్గొననున్న ఆదివాసి గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు...

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం::


భద్రాచలం డివిజన్ లోనే అతి పెద్ద వేల్పుల జాతరైన కాటూరం జాతర మే 27,28,29 తేదీన కె. జీన్నెలగూడెం గ్రామం దుమ్ముగూడెం మండలంలో 3 వ గట్టు వారి మూలమైన జాతర ను అంగరంగ వైభావంగా జరిపించడానికి కమిటీ సభ్యులునిర్ణయించినారు. గిరిజన సంప్రదాయ, సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా జాతర నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ జాతరకు ఆదివాసి బిడ్డలైన నాయకులు పాల్గొంటారు. పార్టీలకి అతీతంగా ఆదివాసీ ముద్దుబిడ్డలైన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు దాదా ,భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పోదెం వీరయ్య , పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా. కాంతారావు , ములుగు నియోజకవర్గం శాసనసభ్యురాలు సీతక్క , జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , భద్రాచలం తెరాస అభ్యర్థి డా .తెల్లం వెంకట్రావు , ఆదివాసీ 9తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ డి ఈ అసుపాక, విచ్చేస్తున్నారని తెలియజేస్తూ యావత్ ఆదివాసీ సమాజం మొత్తం జాతరని తిలకించి విజయవంతం చేయవలసిందిగా కే. జిన్నెలగూడెం గ్రామ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో తుర్రం రవితేజ , రామకృష్ణ, రాజు, నారాయణ, రాజేష్, నక్క సాయిబాబు, తుర్రం రామారావు, ఆదినారాయణ, మోహన్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: