CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా సిఐ ఉపేందర్ రావు, ఎస్ఐ అరుణ.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం,

వినాయకపురం గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ముచ్చర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బుధవారం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 26వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సిఐ ఉపేందర్ రావు, ఎస్ఏ అరుణను ఆహ్వానించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ముచ్చర్ల లక్ష్మీనారాయణ వారికి శాలువాలు కప్పి సత్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. అలాగే సిఐ, ఎస్ఏ చేతుల మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ సోమలింగా చారి, శ్రీరాములు, వెంకటరత్న చారి, శ్రీ రాముల సోమశేఖర చారి, శ్రీరాముల ఈశానంద చారి, మండల శ్రీనివాసాచారి, శ్రీ రామమోహన్, శ్రీ గల సత్యనారాయణ, శ్రీ గల మోహనచారి, రాంబాబు, జగ్గారం, గోపి, ఆలయ అర్చకులు శ్రీ రాముల నిరంజన చారి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: