గుండాల మే 22(మన్యం మనుగడ) పి.డి.ఎస్.యు , పి వై ఎల్ ఆధ్వర్యంలో నేడు జరిగే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆయన అన్నారు. అరకొర ఉద్యోగాలను ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం దానికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉద్యోగ అప్లికేషన్ లో సైతం ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు, పి వై ఎల్ ఎల్.వి పాల్గొన్నారు
Post A Comment: