మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని మాచినేని పేట గ్రామపంచాయతీ పరిధిలోని వాగొడ్డు తండాలో బుధవారం నాభిశిల, ముత్యాలమ్మ తల్లి, గణపతి, నాగదేవత గ్రామదేవతల ప్రతిష్ట పూజ కార్యక్రమాలలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: