మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ములుగు జిల్లా మంగపేట మండలం శనగకుంట గ్రామం లో ఇటీవల అగ్ని ప్రమాద సంఘటనలో 40 ఇల్లు దగ్దం అయ్యాయి. ఈ కారణంగా శనగ కుంట గ్రామానికి దాతల నుండి నిత్యావసరాల, ఆర్థికపరంగా సాయం అందుతూ ఉంది. గురువారం నాడు పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనగకుంట గ్రామానికి వెళ్లి, 45 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ ఆర్థిక సహాయాన్ని ఆదివాసి ఉద్యోగుల సంఘం ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందించింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, ఆదివాసీ సాంస్కృతిక డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్, ఆదివాసి ఉద్యోగులు కేశవరావు, సోలం అశోక్, ఆదివాసి ఐక్యవేదిక కార్యదర్శి గొగ్గల కృష్ణ, శేఖర్, భాస్కర్ శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ రిపోర్టర్ భరత్, మన్యం మనుగడ రిపోర్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: