CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెదవాగు ప్రాజెక్టుకు తరలివస్తున్న గురుకుల డిగ్రీ బాలికల కళాశాల.

Share it:


  దమ్మపేట మే 22 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలోని అంకంపాలెం గ్రామంలో ఉన్నటువంటి బాలికల డిగ్రీ కళాశాల గత మూడు సంవత్సరాల క్రితం సరిపడా వసతి సౌకర్యాలు లేక ఖమ్మంలోని లక్ష్య కాలేజి కళాశాలకు మార్చడం జరిగింది.అందువలన ఏజెన్సీ ప్రాంతాలలో నుండి వచ్చిన విద్యార్థినిలు దూరభారమై మధ్యలోనే చదువు మానేస్తున్నారు అలాగే అంత దూరం వెళ్లి చదువుకోవటానికి విద్యార్థినిలు వెనకడుగు వేస్తున్నారు అందువలన పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరగటం లేదు ఈ విషయంపై ఐటీడీఏ పీవో నీ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎట్టకేలకు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం నుండి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు తరలించడానికి ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు గత మూడు రోజులనుండి షిఫ్టింగ్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది ఇందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు స్థానిక వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: