CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రమాదాల అంచున ఉపాధి హామీ కూలీలు.. ఎండ తీవ్రత దృష్ట్యా కనీస ఏర్పాట్లు కరువు ...

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్ముగూడెం మండలం రేగుబల్లి పంచాయితి, సీతారామపురం పంచాయతీ లోని ప్రజలు రెండు నెలలుగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వారు పనులకు వెలుతున్నారు. పని స్థలంలో కనీసం నీడ కోసం టెంట్ గుడారం లాంటిది కానీ, ప్రమాద వశాత్తూ ఏమైనా జరిగి ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాంటి కనీస సదుపాయాలు కానీ లేకపోవడం ప్రజలపై అధికారుల నిర్లక్ష్యాన్ని అద్దం పడుతుంది. ఒక చెరువు లో ఉపాధి పనులు చేస్తున్నారు ఏ కలుగులోంచి ఏ పాము వస్తుందో తెలీదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వృద్ధులను ఒక వారం పాటు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుని మరలా వారం వచ్చి పని చెయ్యొచ్చు కదా అని బిఎస్ నాయకుడు అడిగితే కళ్ళు చమర్చే సమాధానం చెప్పారు వృద్ధులు. ఇంటి వద్ద ఉంటే పూట గడవదు పరిస్థితి అని. దయచేసి అధికారులు స్పందించి టెంట్ సామాగ్రి, మంచి నీళ్ళు, ప్రథమ చికిత్స పరికరాలు ఉపాధి హామీ పనులు చేసే ప్రాంగణంలో ఏర్పాటు చెయ్యాలని బహుజన సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల ప్రథాన కార్యదర్శి పొడుతూరి రవీంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: