CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య.

Share it:


ములకలపల్లి:(మే12):

మన్యం మనుగడ ప్రతినిధి:

అర్హులైన పేదలందరికీ 5 లక్షల తో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే నిర్మించి ఇవ్వాలని,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇండ్ల హామీని వెంటనే అమలు చేయాలని,దళిత గిరిజన నిరుపేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్లు వెంటనే ఇవ్వాలని, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను నిధులను వెంటనే చెల్లించాలని,ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొలతల తో సంబంధం లేకుండా ఉపాధి హామీ రోజు కూలీ ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే అరికట్టాలని తెలిపారు.పెరిగిన డీజిల్ పెట్రోల్ నిత్యవసర ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు అన్నవరపు సత్యనారాయణ,సంఘం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,నిమ్మల మధు,వూకంటి రవికుమార్,గౌరి నాగేశ్వరరావు,బైరు ప్రసాద్,గడ్డం వెంకటేశ్వర్లు,పోడియం వెంకటేశ్వర్లు,దుబ్బా వెంకటేశ్వర్లు, కాకా అంజలి,కోండ్రు పపామ్మ,ఒగ్గెల పరమమ్మ,పులి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: