గుండాల /ఆళ్ల పల్లి మే 10(మన్యం మనుగడ) మొక్కల పెంపకం లో జాగ్రత్తలు తీసుకోవాలని డి ఆర్ డిఎ పిడి మధుసూదన్ రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆళ్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన మండల కేంద్రంలోని నర్సరీని ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకం లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గత ఏడాది కంటే మొక్కలు ఎక్కువ ఎత్తు అయ్యేవిధంగా చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుభార్గవి, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, ఎంపీడీవో మంగమ్మ, ఎంపీడీవో కవిరాజు, ఏ పీ ఓ రఘునాథ్, ఏ పీ ఎం రాజ్ కుమార్, సర్పంచ్ కోటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: