మన్యం మనుగడ, మంగపేట.
ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం మంగపేట శాఖ అధ్వర్యంలో శనగ కుంట గ్రామములో అగ్ని ప్రమాద బాధితుల కు, 40 కుటుంబాలకు వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు, నీళ్ళ డ్రమ్స్, రూ"లు 85000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, ఒక్కోక్క కుటుంబానికి 1000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈడబ్ల్యూసిఏ మండల అధ్యక్షుడు చింత కృష్ణమూర్తి,ప్రధాన కార్యదర్శి మద్దెల అంజయ్య, ప్రత్యేక ఆహ్వానితులు ఆదివాసీ ప్రజాసంఘాల మాజీ చైర్మెన్ కొమరం నర్సయ్య, టీడబ్ల్యూటీయూ గౌరవ అధ్యక్షుడు పోదేం కృష్ణ ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మరావు,కొండ చెంచయ్య,టీడబ్ల్యూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి, ఏఈడబ్ల్యూసిఏ మండల గౌరవ అధ్యక్షుడు తల్లడి నాగేశ్వరావు, టీడబ్ల్యూటీయూ మండల అధ్యక్షుడు కొమరం మాధవరావు, మెడం హన్మంతరావు, గుండం పురుషోత్తం,మడి మల్లయ్య, అన్నెబోయ్యిన కేశవరావు,కోటే నాగేశ్వరరావు,కొరెం శ్రీను, మద్దెల నాగేశ్వ రావు, సున్నం బుచ్చయ్య, మద్దెల రాంగోపాల్ ,తోలెం బొరయ్య, ఆదివాసీ ఉద్యోగుల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: