గుండాల మే 19(మన్యం మనుగడ) మండలం పరిధిలోని వేపలగడ్డ గ్రామ సమీపంలో నిర్మించిన నలభై రెండు పడకల గృహ సముదాయానికి మంచినీటి సౌకర్యాన్ని మిషన్ భగీరథ అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 40 ఇండ్లకు డి ఎం ఎఫ్ నిధుల కింద ఈ సదుపాయాన్ని కల్పించినట్లు మిషన్ భగీరథ డీఈ పద్మావతి పేర్కొన్నారు. మెటీరియల్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత నాణ్యంగా పైపులైను వేశామని వీటితోపాటు ట్యాంక్, టాప్ పులు సైతం నాణ్యంగా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు
Post A Comment: