మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 5 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామంలో గురువారం బాల వేణుగోపాలస్వామి ఆలయం ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తిశ్రద్ధలతోటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని భక్త జనులంతా భక్తి పారవశ్యంతో దైవ కార్యక్రమం లో పాల్గొని వేణుగోపాల స్వామి నామ స్మరణతో గ్రామమంతా మార్మోగింది. గ్రామంలో ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, తో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తజనులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ పద్మ, స్థానిక ఎం పి పి సోనీ, ఎల్లంకి సత్యనారాయణ, చౌడం నరసింహారావు, యదళ్ళపల్లి వీరభద్రం, మరొకటి సురేష్, రామశెట్టి రాంబాబు, నున్నా రంగారావు, మాచినేని సత్యనారాయణ, మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: