మన్యం టీవి దుమ్ముగూడెం ::
మండలంలోని బైరాగుల పాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ప్రతి ఏటా నిర్వహించే కళ్యాణం లో భాగంగా గ్రామస్తులు మండలంలోని ప్రజలు పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవం లో ముందుగా విశ్వక్సేన పూజ కార్యక్రమం తో ప్రారంభించారు తదనంతరం కలస ప్రతిష్టాపన ఎదుర్కోలు ఊరేగింపు నిర్వహించారు పురోహితులు రాఘవా శర్మ ఆధ్వర్యంలో కల్యాణ తంతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: