మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని బుధవారం నాడు అశ్వాపురం మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ సందర్భంగా ఆయన్ని కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు నీ ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం గా మండల అధ్యక్షులు కోడి అమరేందర్, పినపాక నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు లంకెల రమేష్, నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ,సర్పంచ్ పాయం భద్రయ్య, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: