జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయినాధుని మందిరంలో గురువారం నాడు బాబా వారికి పంచామృత అభిషేకం అర్చనలు జరిపారు.
స్వర్ణ ఆభరణాలు ధరింపజేసి హారతి పాడారు. చిట్టూరి శ్రీనివాసరావు జోష్నా దేవి దంపతులు శ్రీ సాయి బాబా వారి స్వర్ణ రుద్రాక్షమాల కు 11 వేల రూపాయలు విరాళం ఆలయ కోశాధికారి కుంచాల రమేష్ కు అందజేశారని అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు.
మల్లెం విశ్వరూప చారి, సత్య గౌరీ చంద్రజ దంపతులు, గొట్టుపుళ్ల శ్రీనివాసరావు దంపతులు మరియు భక్తుల ద్వారా కలిపి అన్నదానానికి 30 వేల రూపాయలు విరాళాలు సమకూరినవని మధ్యాహ్నం ఐదు వందల మంది భక్తులు బాబా వారి అన్నప్రసాదం స్వీకరించారని వృద్ధాశ్రమం లోని వృద్ధులకు వంద మందికి భోజనం అందజేశామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: