- రేపు జరిగే రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ ను జయప్రదం చేయండి..
- ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జూలూరుపాడు మండల కార్యదర్శి నిమ్మటూరి లచ్చయ్య..
మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 18 కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో సతమతం అవుతున్న ఆటో కార్మికుల పై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వలన ఆటో కార్మికుల ఆర్థికగా నష్టపోతున్నారని, ఆటో వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి నిమ్మ టూరి లచ్చయ్య అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ఆలస్యమైతే రోజుకు యాభై రూపాయలు చెల్లించాలని, ఆటో కార్మికుల పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బందుకు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గార్లపాటి వీరభద్రం, పత్తిపాటి మహేష్, వీరు, గార్లపాటి మహేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: