మన్యం మనుగడ, పినపాక:
అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన బండి పార్థసారథి రెడ్డి, రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బుధవారం నాడు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, రైతు విభాగం మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి ముక్కు వెంకటేశ్వర రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కామేష్, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షులు గాండ్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: