మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం ఎంపీటీసీ ఖాయం శేఖర్ గుండెనొప్పితో బాధపడుతుండగా విషయం తెలుసుకొని తన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పరామర్శించారు. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే తనను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే తీరు పట్ల ఎంపీటీసీ ఖాయం శేఖర్ సంతోషం వ్యక్తపరిచారు. తన విషయంలోనే కాదని అని, ఎవరికి ఎటువంటి బాధ కలిగిన వెంటనే పరామర్శించే వ్యక్తిత్వం రేగా కాంతారావుకు ఉన్నదని, తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: