గుండాల మే 1(మన్యం మనుగడ) ప్రజా పందా ఆధ్వర్యంలో మేడే వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద చేశారు. అనంతరం ప్రజా పందా సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ మాట్లాడుతూ అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఇది గంటల పని దినాలు కి మెరుగైన జీవనానికి 1986లో కార్మికవర్గం పోరాటం చేసింది అన్నారు. పాలకవర్గం ఎనిమిది మందిని కార్మికులను పొట్టన పెట్టుకున్నారు ఈ సంఘటన ప్రపంచాన్ని ఒక్క తాటి మీదికి తెచ్చింది అన్నారు. నాటి ఫలితమే ఈ మేడే కార్యక్రమం ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆకలి లో అలమటించి నిరుపేదలు చనిపోతున్నారు అని అన్నారు. ఇప్పటికీ కార్మికులను బానిసలుగా చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ కార్మిక శక్తి ఒక్కతాటి మీద నిలబడి నప్పుడు కార్మికులకు మెరుగైన సౌకర్యాలు యజమాన్యం కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమరం శాంతయ్య, రాజు, కోడూరి జగన్, సనప కుమార్, పూనెం కృష్ణ , సనప కృష్ణ , ఐఎఫ్టియు నాయకులు పుష్ప రాజ్, పాపయ్య, చీమల సుధాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: