మన్యం మనుగడ వెబ్ డెస్క్ :
‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ , మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే’ డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు . ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతున్నదన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణ లో సంపద సృష్టి జరుగుతున్నదని, అది దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని సిఎం అన్నారు. నిరుద్యోగులు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.
Post A Comment: