మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో ఆదివాసి నాయకపోడ్లు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర సోమవారం నుండి ఐదు రోజులు నిర్వహణ ఉండగా, వారం ముందుగానే జాతర ఏర్పాట్లు వేగవంతం చేశారు. వేదాంతపురం గ్రామం ప్రవేశ పొలిమేర వద్ద స్వాగత ఆర్చరీ బోర్డు ఏర్పాటు అదేవిధంగా కొర్రాజుల స్వామి ప్రత్యేక ఆలయ నిర్మాణం, జాతర జరిగే ప్రాంగణంలో ట్రాక్టర్ తో చదునుచేసి విద్యుత్ అలంకరణ దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేదాంతపురం సర్పంచ్ సోమిని శివప్రసాద్ మాట్లాడుతూ ఐదురోజుల పాటు జరిగే ఈ శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర ఆదివాసీ గిరిజన నాయకపోడు సంస్కృతి సాంప్రదాయాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. ఈ యొక్క జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: