గుండాల/ఆళ్లపల్లి మే 1(మన్యం మనుగడ) కార్మికులకు అండగా ఉంటానని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. ఆదివారం మేడే ను పురస్కరించుకొని గ్రామపంచాయతీ కారోబార్, పారిశుద్ధ్య కార్మికుల తో ఆమె మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి కార్మికుడు మీకు ఎటువంటి సమస్య ఉన్న నేరుగా నన్ను సంప్రదించాలని ఆమె అన్నారు. మీ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆమె అన్నారు. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి కార్మికుడికి అండగా నిలుస్తారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: