మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం గ్రామంలో తరతరాలుగా వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.దుమ్ముగూడెం గ్రామానికి చెందిన దంపతులు నూతన పట్టు వస్త్రాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు .అనంతరం దేవాలయం లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చుక్క గణేష్ రెడ్డి ,కమిటీ మెంబర్స్ దల్లి వేణుబాబు,కెల్లా వేణుగోపాల్, సారిపల్లి రాంబాబు, శివ ,సాయిబాబు, కర్రీ బుజ్జి, బైరెడ్డి సతీష్ , బర్రి నరసింహారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: