గుండాల/ ఆళ్ల పల్లి మే3 (మన్యం మనుగడ) తునికాకు సేకరణ కు వెళ్లి వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మెస్సు పాపమ్మ (57) ఉదయం తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్ళింది ఆకులు సేకరించే క్రమంలో కొంచెం ఇబ్బందిగా ఉందని తోటివారికి చెప్పి ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరే లోపు మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలికి కొడుకు కోడలు గతంలోనే చనిపోవడంతో ప్రస్తుతం మన వల్ల వద్ద ఉంటుంది. ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో పిల్లలు ఇబ్బందుల్లో పడ్డారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం తో పాటు బీడీ ఆకు వ్యాపారి కూడా ఆదుకోవాలని ఆళ్ల పల్లి సర్పంచ్ కోటేశ్వరరావు కోరారు.
Post A Comment: