మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటిడిఎ పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ,యువకులకు వాజేడు మండల సమైక్య (ఐకెపి) నందు ఈనెల 28న జాబ్ మేళా నిర్వహించబడుతుందని, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ జాబ్ మేళ లో మార్కెటింగ్ & సేల్స్, సెక్యూరిటీ గార్డ్స్ టెలీకాలర్స్,ఏసి రిఫర్స్, మెడిసిన్ ప్యాకింగ్,ఫెబ్రికేషన్ వర్క్స్ మొదలైన ఉద్యోగ అవకాశాలు కలవని అన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలకు అభ్యర్థుల విద్యార్హతలు పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ,ఐటిఐ, డిప్లమా చదివి ఉండాలని,18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులు అని అన్నారు. ఆసక్తిగల గిరిజ యువతీ, యువకులు వాజేడు మండలంలోని జరుగు సెలెక్షన్ ను సద్వినియోగం చేసుకోవాలని,పూర్తి సమాచారం కొరకు 9490341911ను, సంప్రదించగలరని ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: